30, మార్చి 2008, ఆదివారం

ఈరోజే రీడర్స్ మీటింగ్, తప్పక హాజరు కాగలరు

ప్రియమైన మిత్రులకు.. ఈరోజు (ఆదివారం 30వతేదీ) మధ్యాహ్నం ౩ గంటలకు పాఠకుల సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే సమావేశ స్థలానికి రావడం విషయంలో ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. ౩ గంటల నుండి 5.30 గంటల వరకూ సమావేశం జరుగుతుంది. నలుగురైదుగురు వచ్చినా సమావేశం జరుగుతుంది. మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు ఒకచోట కలవడమే ప్రధాన ఉద్దేశ్యం తప్ప ఎంతమంది హాజరవుతారు అన్నది కాదు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈరోజు సాయంత్రం 3 గంటలకు కృష్ణకాంత్ పార్క్ టికెట్ తీసుకునే మెయిన్ గేట్ వద్ద గుమికూడి అందరం ఒకేసారి లోపలికి వెళదాం.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా

కామెంట్‌లు లేవు: