25, నవంబర్ 2007, ఆదివారం

పవర్ పోగానే UPS కూడా ఆగిపోతోందా?


మీవద్ద UPS ఉన్నట్లయితే అకస్మాత్తుగా పవర్ సప్లై నిలిచిపోతే మెయిన్ పవర్ సప్లై నుండి UPSలోని బ్యాటరీ ఛార్జ్ తీసుకుని సిస్టమ్ కి విద్యుత్ సరఫరా అందిస్తుంది. అయితే కొన్ని UPSలు అలా కరెంట్ పోగానే అవీ ఆగిపోయి సిస్టమ్ నిలిచిపోవడానికి దారితీస్తాయి. AC నుండి DCకి మారే స్విచ్ఓవర్ సర్క్యూటరీలో లోపం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. నాసిరకం కంపెనీలకు చెందిన UPSలలో ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా తలెత్తుతుంటుంది. అలాగే UPSపై పరిమిత మొత్తంలో మాత్రమే లోడ్ వేయాలి. లేదంటే అవి కరెంట్ పోగానే లోడ్ తట్టుకోలేక ట్రిప్ అవుతుంటాయి, దానితో సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. చాలామంది సిస్టమ్ తోపాటు, స్పీకర్లు, ప్రింటర్, స్కానర్ వంటి అన్ని రకాల పెరిఫెరల్స్ నీ UPSకే కనెక్ట్ చేస్తుంటారు. అలాగే 17", 19" వంటి పెద్ద మోనిటర్ల వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఉదా.కు.. మోనిటర్ వరకూ మాత్రమే ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి. వెంటనే మీరు మోనిటర్ ని ఆన్ చేశారంటే మొత్తం సిస్టమ్ రీస్టార్ట్ చేయబడే ప్రమాదం ఉంది. దీనికి కారణం మోనిటర్ ఆన్ చేయబడిన మొదటి కొద్ది క్షణాల్లో భారీ మొత్తంలో విద్యుత్ ని వాడుకుంటుంది. అంత స్థాయిలో విద్యుత్ ని ఆ కొన్ని క్షణాలపాటు అందించలేక యుపిఎస్ చేతులు ఎత్తేస్తుంది.

కామెంట్‌లు లేవు: